జార్ఖండ్, కర్ణాటకలో భూప్రకంపనలు

X
By - TV5 Telugu |5 Jun 2020 6:44 PM IST
శుక్రవారం ఉదయం జార్ఖండ్లోని జంషెడ్పూర్, కర్ణాటకలోని హంపిలో రెండు చోట్లా తేలికపాటి భూప్రకంపనలు సంభవించాయని వార్తా సంస్థ ANI నివేదించింది. ఉదయం 6:55 గంటలకు జంషెడ్పూర్ 4.7 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించాయని.. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ నుండి డేటాను ఉటంకిస్తూ ANI నివేదించింది.
అదే సమయంలో కర్ణాటకలోని హంపి లో 4.0 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించాయని కూడా వార్తా సంస్థ తెలిపింది. దాంతో ఇళ్లలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా భయంతో బయటకు పరుగులు తీశారు. ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలియజేశారు. కాగా బుధవారం అర్థరాత్రి ఉత్తర ప్రదేశ్లోని నోయిడాలో రిక్టర్ స్కేల్పై 3.2 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చిన సంగతి తెలిసిందే.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com