ఏపీలో మరో 125 కరోనా పాజిటివ్ కేసులు

X
By - TV5 Telugu |8 Jun 2020 8:51 PM IST
ఏపీలో కరోనా కేసుల విజృంభణ కోనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో (ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకూ) మొత్తం 14,246 శాంపిల్స్ ను పరీక్షించడంతో కొత్తగా మరో 125 పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించిన తాజా బులిటెన్ లో పేర్కొంది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,843కి చేరింది. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా 2.381 మంది కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే గత 24 గంటల్లో 34 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1381 మంది కోవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారు. కాగా ఇప్పటివరకూ 75 మంది మృతి చెందారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

