ఈ 5 రాష్ట్రాలలో కొత్త కరోనా కేసులు, మరణాల సంఖ్య ఇదే..

ఈ 5 రాష్ట్రాలలో కొత్త కరోనా కేసులు, మరణాల సంఖ్య ఇదే..
X

దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 2 లక్షల 56 వేలకు పెరిగింది. ఆదివారం రికార్డు స్థాయిలో 10 వేల 884 కేసులు రాగా. ఒక రోజు ముందు, (శనివారం) 10 వేల 408 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 3 వేల 7 కొత్త కేసులొచ్చాయి.. దీంతో రాష్ట్రంలో వ్యాధి సోకిన వారి సంఖ్య 85 వేల 975 గా ఉంది.

5 రాష్ట్రాలలో కరోనా కేసులు, మరణాల సంఖ్య ఇలా ఉంది..

మధ్యప్రదేశ్: ఇక్కడ కొత్తగా 173 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. అలాగే 13 మంది మరణించారు. కొత్తగా భోపాల్‌లో 39, ఇండోర్‌లో 27, గ్వాలియర్‌లో 12, ​​ఖార్గోన్, మొరెనాలో 10 చొప్పున పెరిగాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం 9401 మందికి పాజిటివ్ ఉన్నట్లు నివేదించారు. దేశంలోని మఠాలు, దేవాలయాలు, మసీదులు, చర్చిలు మరియు గురుద్వారాలు జూన్ 8 నుండి తెరవబోతున్నాయి, అయితే భోపాల్‌లో మాత్రం మతపరమైన ప్రదేశాలపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.

ఉత్తర ప్రదేశ్: ఆదివారం 433 కేసులు రావడమే కాక 7 గురు మరణించారు. కొత్త కేసులలో ఘజియాబాద్‌లో 46, బులంద్‌షహర్‌లో 21, ముజఫర్ నగర్‌లో 21, మీరట్ 18, కాన్పూర్‌లో 18, ఆగ్రా 17, గౌతమ్ బుద్‌నగర్‌లో 17, బాగ్‌పట్‌లో 16, అలీగర్ లో 15 అంటువ్యాధులు పెరిగాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 10 వేల 536 మంది రోగులు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో 4076 క్రియాశీల కేసులు.

మహారాష్ట్ర: రికార్డు స్థాయిలో 3007 మంది రోగులు ఆదివారం ఇక్కడ నమోదయ్యాయి. కొత్తగా ఓ టీవీ జర్నలిస్టుతో సహా 91 మంది మరణించారు. రాష్ట్రంలో కరోనా నుంచి మరణించిన వారి సంఖ్య 3060 కు పెరిగింది. ఇప్పుడు 85 వేల 975 మందికి కరోనా సోకింది. వీటిలో 43 వేల 601 క్రియాశీల కేసులున్నాయి.. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా 3 వేలకు పైగా పోలీసులు కరోనా భారిన పడ్డారు.. ఇందులో 30 మంది మరణించారు.

రాజస్థాన్: రాష్ట్రంలో కొత్తగా 262 మందికి కరోనా సోకినట్లు అధికారులు నిర్ధారించారు, అలాగే 9 మంది మరణించారు. కొత్త కేసులు జోధ్‌పూర్‌లో 81, భరత్‌పూర్‌లో 63, జైపూర్‌లో 38, సికార్‌లో 11, నాగౌర్‌లో 9, టోంక్‌లో 6 గా నమోదయ్యాయి. దీనితో, రాష్ట్రంలో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 10 వేల 599 కు చేరుకుంది. వీటిలో 2606 క్రియాశీల కేసులు ఉన్నాయి. కరోనా నుండి ఇప్పటివరకు 240 మంది మరణించారు.

బీహార్: ఆదివారం 239 మందికి పాజిటివ్ అని తేలింది. ఇందులో సుపాల్‌లో 36, ముజఫర్‌పూర్‌లో 30, పశ్చిమ చంపారన్‌లో 19, సమస్తిపూర్, ముంగేర్‌లో 15 మంది, సీతామార్హిలో 10 మంది ఉన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం 5070 మందికి కరోనా సోకినట్లు గుర్తించగా, అందులో 2635 మంది క్రియాశీల కేసులు ఉన్నాయి. కరోనా నుండి ఇప్పటివరకు 30 మంది మరణించారు.

Tags

Next Story