బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో టెన్త్ పరీక్షలు రద్దు.. అందరూ పాస్

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో టెన్త్ పరీక్షలు రద్దు.. అందరూ పాస్

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. అనేక తర్జన భర్జనల నడుమ అందరూ పాస్ అంటూ ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఒకటీ రెండు పరీక్షలు రాయగానే లాక్డౌన్ వచ్చి అందర్నీ ఇంట్లో కూర్చోబెట్టింది. కొత్త విద్యా సంవత్సరానికి ముందే విద్యార్థులకు పరీక్షలు రిజల్ట్ ఇవ్వాలనుకున్న నేపథ్యంలో హైకోర్టు తీర్పు.. విద్యార్ధుల జీవితాలతో చెలగాటం ఆడకూడదన్న నిర్ణయంతో ప్రభుత్వం ఒక ఏకాభిప్రాయానికి వచ్చింది. అందరినీ ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడింగ్‌లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

Tags

Next Story