చైనాలో యాక్టివ్ కరోనా కేసులు కేవలం 65..

కరోనావైరస్ కు కేంద్రంగా ఉన్న చైనాలో పరిస్థితులు పూర్తిగా అదుపులోనే ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేవలం 65 కేసులు మాత్రమే ఉన్నాయి. చైనాలో సోమవారం వరకు 83,040 కేసులు నమోదు కాగా, ఇందులో 78,341 మంది ఆరోగ్యాంగా కోలుకున్నారు. అలాగే 4,634 మంది కరోనాతో మరణించారు. దాంతో ప్రస్తుతం కేవలం 65 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. అయితే ఇందులో కూడా 64 మందికి సాధారణ ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయని.. ఒకరికి మాత్రం సీరియస్ గా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.
జనవరి 23 నుంచి చైనాలో కేసుల పెరుగుదల కనిపించింది. అది ఫ్రిబ్రవరి 29 వరకూ కొనసాగింది. అయితే ఆ తరువాత మార్చి 6 వరకూ కేవలం 150 లోపే కేసులు నమోదవుతున్నాయి. అయితే కొద్ది రోజులుగా కేవలం ఒకటి రెండూ మాత్రం వస్తున్నాయి. ఇటు మరణాలు కూడా జనవరి- ఫ్రిబ్రవరి మధ్య కాలంలోనే అధికంగా సంభవించాయి. అయితే ప్రస్తుతం పూర్తిగా మరణాల సంఖ్య అదుపులోనే ఉంది. దీన్ని బట్టి చూస్తుంటే చైనాలో కరోనా పూర్తిస్థాయిలో అదుపులో ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com