నేపాల్లో కొత్తగా 323 మందికి కరోనా.. ఇందులో వారే ఎక్కువ..

X
By - TV5 Telugu |10 Jun 2020 4:43 PM IST
నేపాల్లో ప్రస్తుతం కరోనావైరస్ కేసులు నిలకడగా కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 323 మందికి కరోనా సోకింది. వీరిలో 292 మంది పురుషులు కాగా 31 మంది మహిళలు ఉన్నారు. దీనితో ఇక్కడ అంటువ్యాధుల సంఖ్య 4085 కి చేరుకుంది. ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకారం దేశంలో ఇప్పటివరకు 15 మంది మరణించారు. ఇప్పటివరకు 584 మంది ఆరోగ్యంగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశంలో ఇప్పటివరకూ 1 లక్ష 6 వేల 303 మందికి కరోనా పరీక్షలు చేశారు.మంగళవారం నేపాల్ పిఎం హౌస్ వెలుపల పరీక్ష మరియు దిగ్బంధం కేంద్రాల వద్ద ప్రజలు పెద్దఎత్తున చేరి లాక్డౌన్ ఆంక్షలను సడలించాలని డిమాండ్ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com