యూకేలో 50వేలు దాటిన కరోనా మరణాలు

X
అమెరికా తరువాత యూకేలో కరోనా మరణాలు ఎక్కువగా సంభవించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇంగ్లాండ్ , వేల్స్, స్కాట్లాండ్ , ఉత్తర ఐర్లాండ్ జాతీయ గణాంక కార్యాలయాల ప్రకారం, UK లో ఇప్పటివరకు 50,000 మందికి పైగా మరణించారు. స్టాటిస్టిక్స్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (ఒఎన్ఎస్) ప్రకారం, మే చివరి నాటికి సుమారు 50,413 మంది మరణించారు. మే 29 నాటికి ఇంగ్లాండ్, వేల్స్లో 45,748 మంది మరణించినట్లు ఒఎన్ఎస్ తెలిపింది. అదే సమయంలో, స్కాట్లాండ్లో మే 31 నాటికి 3,911 మంది, ఉత్తర ఐర్లాండ్లో మే 29 నాటికి 754 మంది మరణించారు. ఇక యూకేలో కరోనా కేసులు మొత్తం 289,140 ఉన్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
