మాజీ మంత్రి అచ్చెన్నాయుడును విచారిస్తున్న ఏసీబీ

X
By - TV5 Telugu |12 Jun 2020 3:48 PM IST
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈఎస్ఐలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ.. విచారణలో భాగంగా ఆయనను అదుపులోనికి తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా చంద్రబాబు హయాంలో నాటి కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు అచ్చెన్నాయుడు. ప్రస్తుతం అసెంబ్లీలో టీడీపీ ఉపనేతగా అచ్చెన్నాయుడు ఉన్నారు. ఈ పరిణామంతో అచ్చెన్నాయుడు ఇంటివద్దకు ఆయన అభిమానులు భారీగా చేరుకుంటున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

