ట్రంప్ ర్యాలీలో పాల్గొన్న వారికి కరోనా వచ్చినా.. కేసులు పెట్టకూడదు: ప్రభుత్వం
By - TV5 Telugu |12 Jun 2020 7:35 PM GMT
అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ భారీ ర్యాలీ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. కరోనా విజృంభణ తరువాత ఏర్పాటు చేస్తున్న ఈ ర్యాలీకి హాజరవుతున్న వారికి ప్రభుత్వం ఓ హెచ్చరిక చేసింది. ఈ సభకు 19వేల మంది కూర్చునే సదుపాయం ఉంది. అయితే, ఈ ర్యాలీలో పాల్గొనే వారికి ఎవరికైనా కరోనా సోకితే.. వారెవరూ ట్రంప్ పై కేసులు పెట్టకూడదని తెలిపింది. ఈ నిబంధనకు ఒప్పుకోకపోతే.. ర్యాలీలో పాల్గోవద్దని అధ్యక్షుడి క్యాంపెయిన్ వెబ్సైట్ తెలిపింది. ఓక్లహామాలో ప్రారంభమై.. టుల్సాలోని బీవోకే సెంటర్లో సభ ఏర్పాటు చేయనున్నారు. అయితే, నీ నిబంధనను చూసిన వారంతా.. ఏంటీ ఈ వింతైన నిబంధన అని నోరెళ్లబెడుతున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com