ఉన్నప్పుడు ఎవరూ పట్టించుకోరు.. పోయిన తరువాత అంతా నీతులు మాట్లాడేవాళ్లే: మీరా చోప్రా

X
బాలీవుడ్ యువహీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య వార్తల నుంచి అభిమానులు, సినీ ప్రముఖులు ఇంకా తేరుకోవడం లేదు. సుశాంత్ ఆత్మహత్యపై స్పందించిన పలువురు బాలీవుడ్ ఇండస్ట్రీపై తీవ్రంగా మండిపడుతున్నారు. తాజాగా మీరా చోప్రా స్పందించింది. గత కొంత కాలంగా సుశాంత్ డిప్రెషన్తో ఉన్నాడని.. అప్పుడు ఎవరూ పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇండస్ట్రీలో జాలి, దయ, కరుణ అనే పదాలకు చోటు లేదని బాలీవుడ్ ను ఉద్దేశించి మండిపడింది. కలిసి పనిచేసిన వ్యక్తికి కష్టంలో ఉన్నపుడు అండగా లేకపోవడం దారుణమని మీరా చోప్రా అన్నారు. బ్రతికున్నపుడు పట్టించుకునే వారు లేరు కానీ, చనిపోయాక మాత్రం అందరూ నీతులు చెబుతారని ఆవేదన వ్యక్తం చేసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
