నిమ్మగడ్డ కేసు: హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు మరోసారి నిరాకరించిన సుప్రీం కోర్టు

నిమ్మగడ్డ కేసు: హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు మరోసారి నిరాకరించిన సుప్రీం కోర్టు
X

ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ వ్యవహారంలో స్టే ఇచ్చేందుకు మరోసారి నిరాకరించింది సుప్రీం కోర్టు. రమేశ్‌కుమార్‌ వ్యవహారంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి వేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ పునర్‌ నియామకాన్ని సవాల్‌ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరింది. పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఇదే అంశంపై ఇప్పటికే విచారణ జరిపి నోటీసులు ఇచ్చామన్న సీజేఐ, ఈ పిటీషన్‌పై కూడా నోటీసులు జారీ చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌తో కలిపి విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది. ఈమేరకు కొత్తగా దాఖలైన పిటిషన్లను గత పిటిషన్లతో ట్యాగ్‌ చేసింది. దీనిపై వచ్చే వారం విచారణ జరిగే అవకాశముంది.

SEC విషయంపై ఇప్పటికే ప్రభుత్వం ఓసారి సుప్రీం తలుపు తట్టింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరింది. ఇందుకు సుప్రీం ధర్మాసనం ఒప్పుకోలేదు. SEC పదవీకాలం కుదింపు ఆర్డినెన్స్‌పై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ఆర్డినెన్స్ వెనుక ఉన్న ఉద్దేశాలు నమ్మదగ్గవిగా లేవని చీఫ్ జస్టిస్ బోబ్డే వ్యాఖ్యానించారు. ప్రతివాదులు కూడా కౌంటర్ దాఖలు చేశాక.. 2 వారాల తర్వాత పూర్తిస్థాయిలో వాదనలు వింటామని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఇప్పుడు ఇదే అంశంపై ఎన్నికల సంఘం కార్యదర్శి మళ్లీ పిటిషన్ వేశారు. స్టేకు నిరాకరించిన సుప్రీం కోర్టు.. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌తో కలిపి విచారణ చేపడతామని స్పష్టం చేసింది.

Tags

Next Story