విజయనగరం జిల్లాలో అగ్రిగోల్డ్ బాధితుల ఆందోళన

X
By - TV5 Telugu |20 Jun 2020 10:53 PM IST
తమకు రావలిసిన డబ్బును ప్రభుత్వం వెంటనే చెల్లించాలంటూ విజయనగరం జిల్లాలో అగ్రిగోల్డ్ బాధితులు ఆందోళనకు దిగారు. జిల్లా వ్యాప్తంగా 2 లక్షల 20 వేల మంది బాధితులు ఉన్నారని.. మొత్తం 720 కోట్ల మేర మాత్రమే చెల్లింపులు జరిపారని అన్నారు. అగ్రిగోల్డ్ డబ్బులు అందక ఆర్ధిక ఇబ్బందులతో 40 మంది బాధితులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని గణపతినగరం,మెంటాడ,భోగాపురం,ఆరికతోట,కొరాడ ప్రాంతాల్లో అగ్రిగోల్డ్కు భూములు ఉన్నాయని..వెంటనే వాటిని అమ్మి తమకు డబ్బులు చెల్లించాలని బాదితులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com