ప్రతి వంద మందిలో 14 మందికి పాజిటివ్..!!

X
By - TV5 Telugu |24 Jun 2020 12:29 AM IST
రాష్ట్రంలో వైరస్ విస్తరిస్తోంది. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు పరీక్షలు చేయించుకున్న ప్రతి వంద మందిలో 14 మందికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. రాష్ట్రంలో కరోనా టెస్టుల పాజిటివ్ రేటు 14.39 శాతం ఉంటే జాతీయ స్థాయిలో అది 6.11శాతం ఉంది. ఏప్రిల్ నెలాఖరు నాటికి 5.2 శాతం ఉన్న పాజిటివ్ కేసుల సంఖ్య మే 14 నాటికి 6.07 శాతానికి పెరిగింది. అది కాస్తా జూన్ 16 కల్లా 12.6 శాతానికి పెరిగింది. గత నాలుగైదు రోజులుగా టెస్టులు చేయించుకుంటున్న ప్రతి వంద మందిలో 20 మందికి వైరస్ సోకినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో టెస్టుల సంఖ్య పెంచడంతో పాజిటివ్ కేసుల సంఖ్య వెలుగు చూస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com