మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు శతజయంతి ఉత్సవాలు.. ఏడాది పాటు
![మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు శతజయంతి ఉత్సవాలు.. ఏడాది పాటు మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు శతజయంతి ఉత్సవాలు.. ఏడాది పాటు](http://tv5site.vocalwire.com/wp-content/uploads/2020/06/P.V.jpg)
By - TV5 Telugu |23 Jun 2020 8:32 PM GMT
మాజీ ప్రధాని పీవీ నర్సింహా రావు శతజయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. పివీ శతజయంతి వేడుకలపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పీవీ పుట్టిన రోజైన జూన్ 28నుంచి ఈ ఉత్సవాలను ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రధానిగా, ఆర్ధిక సంస్కర్తగా దేశానికి ఆయన చేసిన సేవలను ఘనంగా స్మరించుకోవాలని సూచించారు కేసీఆర్. పీవీ శతజయంతి ఉత్సవాల నిర్వహణ కోసం..సీనియర్ పార్లమెంట్ సభ్యుడు కే. కేశవరావు ఆధ్యర్యంలో కమిటీని నియమించారు. ఈ కమిటీలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్శర్మ, పీవీ కుమారుడు ప్రభాకర్రావు, కుమార్తె వాణీదేవీ, మంత్రులు ఈటెల, కేటీఆర్ మరికొంత మంది ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com