ఎగ్జామ్ లేకుండానే 'ఎస్బీఐ' లో ఉద్యోగం.. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

భారతీయ స్టేట్ బ్యాంక్ నిరుద్యోగులకు శుభవార్త అందించింది. 444 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు జులై 13 లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది. సంస్థకు సంబంధించిన వెబ్ సైట్ లో లాగిన్ అయి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. దరఖాస్తు చేసే అభ్యర్థులు రెజ్యూమ్ తో పాటు గుర్తింపు, వయసు ధ్రువీకరణ పత్రాలు, విద్యార్హత, అనుభవానికి సంబంధించిన పత్రాలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగార్ధులు ఎలాంటి పరీక్ష రాయనవసరం లేదని ఎస్బీఐ తెలిపింది. అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి 100 మార్కులకు ముఖాముఖి నిర్వహిస్తారు. అందులో అర్హత మార్కులను బ్యాంకు నిర్ణయిస్తుంది. ఏ ఇద్దరు అభ్యర్ధులకైనా కటాఫ్ మార్కులు సమానంగా వస్తే వయసు ఆధారంగా ఎంపిక ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com