ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తే నోటీసులా..?

వైసీపీ ప్రభుత్వం పనితీరు, పార్టీ విధానాలను ప్రశ్నించిన నర్సాపురం ఎంపీ రఘు రామకృష్ణ రాజుకు ఆ పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఈ నోటీసులు జారీ చేశారు. అధిష్ఠానానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిందుకుగాను షోకాజు నోటీసులు జారీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.. పశ్చిమ గోదావరి జిల్లా నాయకులకు, ఎంపీ రఘురామకృష్ణం రాజు మధ్య కొంతకాలం విమర్శల పర్వం కొనసాగుతోంది. ఈ వ్యవహారం సీఎం జగన్ వరకూ వెళ్లింది. మొత్తం ఎపిసోడ్ను సీరియస్గా తీసుకున్న జగన్... విచారణ జరపాలని పార్టీ క్రమశిక్షణ సంఘాన్ని ఆదేశించారు. ఈ క్రమంలోనే రఘురామ కృష్ణం రాజుకు షోకాజ్ జారీ చేశారు.
పార్టీ పంపిన షోకాజు నోటీసుపై రఘరామకృష్ణంరాజు స్పందించారు. తాను ఏ నాడు పార్టీని కానీ, పార్టీ అధ్యక్షుణ్ని కాని పల్లెత్తు మాట అనలేదని చెప్పారు. కేవలం సంక్షేమ పథకాల్లో తప్పిదాలనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని అన్నారు.. సీఎం జగన్ అపాయింట్మెంట్ దొరకక పోవడం వల్లే మీడియా ద్వారా తెలియజేశానని తెలిపారు...షోకాజ్ నోటీస్పై గురువారం పార్టీకి సమాధానం పంపుతానని చెప్పారు రఘురామ కృష్ణంరాజు..
ఇటీవల పార్టీ విధివిధానాలు, ప్రభుత్వ పథకాల్లోని లోపాలను ప్రశ్నించారు రఘురామ కృష్ణంరాజు. ఇసుక అక్రమ రవాణా, ఇళ్ల స్థలాల కేటాయింపుల్లో అవకతవకలను బాహాటంగానే నిలదీశారు. ఆర్డినెన్స్ ద్వారా నిమ్మగడ్డ రమేష్ కుమార్ను తొలగించడం కరెక్టు కాదన్నారు. తిరుమల శ్రీవారి భూముల అమ్మకం విషయంలోనూ అందరి కంటే ముందుగా ఆయనే స్పందించారు. ఇంగ్లిష్ మీడియం విషయంలో పార్లమెంట్లోనే సొంత పార్టీ విధానానికి వ్యతిరేకంగా మాట్లాడారు..
ఇటీవల వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీ రఘురామకృష్ణంరాజు లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఎంపీ. తానెవరినీ టికెట్ అడగలేదని.. బతిమాలితేనే వైసీపీలోకి వచ్చాననిఅన్నారు. సింహమే సింగిల్గా వస్తుందని.. పందులే గుంపుగా వస్తాయంటూ పవర్ఫుల్ డైలాగ్ చెప్పారు. నరసాపురం వైసీపీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజుపైనా ఘాటు విమర్శలు చేశారు రఘురామకృష్ణంరాజు. ప్రసాదు రాజుతో మాట్లాడిస్తున్నవారు ఎవరో తనకు తెలుసని అన్నారు. తనపై వ్యాఖ్యలు చేసిన ప్రసాద్ రాజుకి త్వరలో మంత్రి పదవి వస్తుందని జోస్యం చెప్పారు. అటు ఎమ్మెల్యేలు కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, మంత్రి శ్రీరంగనాథరాజు తనపై చేసిన విమర్శలకు సమాధానం ఇచ్చిన రఘురామకృష్ణం రాజు... వారిపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు..
ఇటీవలే తనకు ప్రాణహాని ఉందంటూ లోక్సభ స్పీకర్, జిల్లా ఎస్పీలకు లేఖ రాశాలు ఎంపీ రఘురామకృష్ణంరాజు . తనను చంపుతామని కొందరు వ్యక్తులు బెరిరిస్తున్నారని వాపోయారు. కేంద్రబలగాలతో తనకు రక్షణ కల్పించాలంటూ లోక్సభ స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. కొంతకాలంగా రఘురామకృష్ణం రాజును వైసీపీ దూరం పెడుతోంది..పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదు..సీఎం జగన్తో భేటీకి సమయం అడిగినా ఇవ్వలేదని ఇటీవలే చెప్పారు రఘురామకృష్ణం రాజు...ఈ సమయంలో ఆయనకు పార్టీ షోకాజు నోటీసులు పంపడం చర్చనీయాంశమైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com