ఘోర ప్రమాదం.. కారును లాక్కెళ్లిన ట్రైన్

X
By - TV5 Telugu |27 Jun 2020 8:57 PM IST
కడపలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారును ట్రైన్ లాక్కెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎర్రగుంట్ల మండలం వై కోడూరు దగ్గర.. కాపలాలేని క్రాస్ వద్దకు ఓ కారు దూసుకొచ్చి ట్రాక్ మధ్యలో ఆగిపోయింది. ఇంతలో ఓ రైలు దూసుకురావడంతో కారును కొంత దూరం లాక్కెళ్లి విడిచిపెట్టింది.
రైలు స్పీడు తక్కువగా ఉండటంతో కారు ట్రాక్ మీదే ఆగిపోయింది. కారును రైలు 200 మీటర్ల దూరం లాక్కెళ్లింది. కేవలం 20 కిలోమీటర్ల స్పీడుతో ట్రైన్ రావడంతో కారు ట్రాక్ మీదే ఆగిపోయింది. లేదంటే ట్రాక్ దెబ్బతినేదని రైల్వే అధికారులు చెబుతున్నారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com