ట్రంప్పై అరెస్ట్ వారెంట్ జారీ
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్పై ఇరాన్ ప్రభుత్వం అరెస్ట్ వారంట్ జారీ చేసింది. అమెరికా, ఇరాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలోట్రంప్ను అరెస్ట్ చేసేందుకు ఇరాన్ ఏకంగా వారంట్ జారీ చేసింది.
2020, జనవరి 3న బాగ్దాద్లో జరిగిన డ్రోన్ దాడిలో ఇరాన్కు చెందిన కీలక సైన్యాధికారి ఖాసీం సులేమానీ ప్రాణాలు కోల్పోయారు. అయితే జనరల్ ఖాసిం సులేమానీని అమెరికా దారుణంగా హతమార్చిందని ఇరాన్ నమ్ముతుంది. ఈ ఘటనలో ట్రంప్పై కేసు నమోదు చేసిన ఇరాన్.. అరెస్ట్ వారంట్ జారీ చేసింది.
ట్రంప్ను అరెస్ట్ చేసి తమకు అప్పగించాలని ఇరాన్ ఇంటర్పోల్కు విజ్ఞప్తి చేసింది. ఈ విషయాన్ని ఇరాన్కు చెందిన ప్రాసిక్యూటర్ ధ్రువీకరించారు. ట్రంప్తోపాటు మరో 35 మందికి ఇరాన్ ప్రాసిక్యూటర్ అలీ అల్ఖ్వాసిమెర్ పేరిట వారెంట్ విడుదలైంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com