నిన్న టిక్టాక్.. ఈ రోజు వీబో: చైనాకు మరో షాక్
By - TV5 Telugu |1 July 2020 8:48 PM GMT
59 చైనా యాప్ లను రద్దు చేసిన మోదీ సర్కార్ ఈ రోజు వీబో అకౌంట్ ను తొలగించారు. 2015లో చైనాలో పర్యటించిన ప్రధాని విబో ఖాతాను తెరిచారు. అయితే ప్రస్తుత పరిస్తితులు చైనాకు అనుకూలంగా లేనందున వీబో అకౌంట్ లో గతంలో పెట్టిన ప్రొఫైల్ ఫోటోతో పాటు పూర్తి వివరాలను, కామెంట్లను, పోస్టులను అన్నింటినీ తొలగించారు. ఈ రోజు ఆ పేజి బ్లాంక్ గా ఉందని అధికారులు ప్రకటించారు. వీబోలో మోదీకి 2,44,000 మంది ఫాలోయర్లు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది చైనీయులే ఉండడం గమనార్హం. చైనా భాషలోనే మోదీ వారితో సంభాషణ నెరపేవారు. 2015 నుండి భారత ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పుట్టిన రోజు జూన్ 15 సందర్భాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు అందజేసేవారు. కానీ ఈ ఏడాది జిన్ పింగ్ కు మోదీ శుభాకాంక్షలు తెలపలేదు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com