గల్వాన్ లోయలో గాయపడిన సైనికులను పరామర్శించిన ప్రధాని

X
By - TV5 Telugu |3 July 2020 6:52 PM IST
భారత ప్రధాని నరేంద్రమోదీ లడక్ లో పర్యటిస్తున్నారు. భారత్, చైనా మధ్య సరిహద్దు విషయంలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ మోదీ ఇలా లడక్ లో పర్యటించడం సైనికుల్లో ఆత్మస్థైర్యం నింపినట్టు అవుతోంది. ప్రధాని మోదీతో పాటు త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ నరవాణేలు కూడా లడక్ లో పర్యటించారు. చైనాతో జరిగిన చర్చల్లో భారత్ తరపున హాజరైన లెఫ్ట్నెంట్ జనరల్ హరీందర్ సింగ్ ప్రధానిమోదీకి అన్ని వివరాలు తెలిపారు. చైనా, భారత్ సైనికుల మధ్య జూన్ 15 జరిగిన వివాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని మోదీ పరామర్శించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

