శనివారం టీటీడీ పాలకమండలి సమావేశం

X
By - TV5 Telugu |4 July 2020 3:07 PM IST
శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం జరుగనుంది. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాన్ని టీటీడీ నిర్వహించనుంది. దర్శన విధివిధానాలపై పాలకమండలి చర్చించనుంది.
కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో.. ప్రస్తుతం 12వేల మంది భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. అయితే ఈ సంఖ్యను పెంచే అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. కరోనా బారిన పడుతున్న టీటీడీ ఉద్యోగుల సంఖ్య పెరుగుతుంది. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాలకమండలి చర్చించనుంది. ఇక టీటీడీ ఆస్తులపై శ్వేత పత్రం కూడా విడుదల చేసే అవకాశం ఉంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com