ఘోర ప్రమాదం.. గాల్లో ఢీకొన్న రెండు విమానాలు

X
By - TV5 Telugu |6 July 2020 9:38 PM IST
అమెరికాలోని ఇదాహో రాష్ట్రంలో సోమవారం ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. రెండు విమానాలు గాల్లో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఢీకొన్న రెండు విమానాలు కోయర్ డీ అలెన్ సరస్సులో మునిగిపోయినట్లు అధికారులు వెల్లడించారు. అయితే అందులో నుంచి అతి కష్టం మీద రెండు మృతదేహాలను వెలికితీయగలిగారు రెస్క్యూ సిబ్బంది. మరో ఆరు మృతదేహాల కోసం గాలిస్తున్నారు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మరణించిన వారిలో పిల్లలు, పెద్దవాళ్లు ఉన్నట్లు తెలిపారు. విమాన ప్రమాదంపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com