తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం : వాతావరణ శాఖ
By - TV5 Telugu |6 July 2020 10:21 PM GMT
తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు.
బంగాళాఖాతంపై కేంద్రీకృతమైన అల్పపీడనం.. క్రమంగా వాయువ్యదిశగా పయనిస్తుంది. ఈ అల్పపీడనం ప్రస్తుతం జార్ఖండ్, ఉత్తర ఒడిశాను అనుకుని కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపీలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com