గార్డు కమాండర్ను హత్యచేసి ఆపై తుపాకీతో కాల్చుకున్న జవాన్
By - TV5 Telugu |7 July 2020 3:17 AM GMT
ఓ జవాన్.. గార్డు కమాండర్ను హత్య చేసి.. ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన
జమ్మూకాశ్మీర్లోని కుల్గాం జిల్లాలో చోటుచేసుకుంది. కుల్గాం జిల్లా శాస్త్రా సీమా బాల్ (ఎస్ఎస్బి) లో బిఎస్ఎఫ్ జవాన్ సోమవారం సాయంత్రం గార్డు కమాండర్ను హత్య చేసి. ఆ తర్వాత సర్వీస్ రైఫిల్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
సాయంత్రం జిల్లా కోర్టు కాంప్లెక్స్లో ఈ సంఘటన జరిగిందని అధికారులు వార్తా సంస్థకు తెలిపారు. ఇక్కడే ఎస్ఎస్బి 8వ బెటాలియన్ను భద్రత కింద మోహరించారు. హత్యగావించిన కమాండర్ ASI హోదాలో ఉన్నారు. ఓ విషయంలో జవాన్, కమాండర్ మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. దాంతో గొడవ జరిగింది. ఇది ప్రాణాలు తీసే స్థాయికి చేరింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com