ఏపీలో 151 మంది జూనియర్‌ సివిల్‌ జడ్జీలు బదిలీ

ఏపీలో 151 మంది జూనియర్‌ సివిల్‌ జడ్జీలు బదిలీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలువురు జూనియర్‌ సివిల్‌కోర్టు జడ్జీలను బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన 151 మంది జూనియర్‌ సివిల్‌ జడ్జీలకు హైకోర్టు బదిలీలు, పోస్టింగ్‌లు కల్పించింది. ఈ మేరకు బుధవారం హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా ఈ నెల 15 లోపు రిలీవ్‌ కావాలని ఆదేశించారు. అలాగే 22 లోపు నూతన స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాలని ఉత్తర్వులు జారీ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story