కేరళలో కొత్తగా 301 వైరస్ సంక్రమణ కేసులు

X
By - TV5 Telugu |9 July 2020 2:59 AM IST
కేరళలో బుధవారం కొత్తగా 301 సంక్రమణ కేసులు నమోదయ్యాయి. గత 25 గంటల్లో కోవిడ్ -19 కు పాజిటివ్ తేలిన వారిలో 99 మంది విదేశాల నుండి తిరిగి వచ్చారు, మరో 95 మందికి ఇతర రాష్ట్రాల ప్రయాణ చరిత్ర ఉంది.. ఇక మరో 90 మంది కరోనా సోకిన వారితో పరిచయాల ద్వారా సంక్రమనకు గురయ్యారు. తాజాగా వచ్చిన రోగులలో 9 మంది బిఎస్ఎఫ్ జవాన్లు, 3 మంది ఐటిబిపి జవాన్లు, 3 మంది ఆరోగ్య కార్యకర్తలు, 1 సిఐఎస్ఎఫ్ జవాన్ మరియు 1 సిఎస్డి ఉన్నారు. కొత్త కేసుల్లో తిరువనంతపురం 64, మలప్పురం 45, త్రిశూర్, పాలక్కాడ్ 25 కేసులు ఉన్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

