కిరణ్ బేడీకి కరోనా సోకలేదు : అధికారులు

X
By - TV5 Telugu |9 July 2020 8:54 PM IST
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీకి కరోనా సోకలేదని అధికారులు తెలిపారు. గవర్నర్ అధికారిక నివాసం రాజ్ నివాస్లో పనిచేసే ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. కిరణ్ బేడీకి వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా నెగెటివ్గా నిర్ధారణ అయిందని గవర్నర్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
కిరణ్ బేడీతో పాటు సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందరికీ కరోనా నెగెటివ్గా నిర్ధారణ అయింది. గవర్నర్ బంగ్లాలో పనిచేసే సిబ్బందిలో ఒకరికి కరోనా నిర్ధారణ కావడంతో 48 గంటల పాటు కార్యాలయాన్ని మూసివేసి శానిటైజ్ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com