సుశాంత్ మరణం.. డిప్రెషన్ లో కరణ్ జోహార్

నటుడు సుశాంత్ మరణానికి బాలీవుడ్ లో బంధుప్రీతే కారణమని పలువురు నటీనటులు విమర్శించిన సంగతి తెలిసిందే. ఇక నటి కంగనా రనౌత్ అయితే ఏకంగా కరణ్ జోహారే బంధుప్రీతికి మార్గదర్శకుడని వ్యాఖ్యానించింది. స్టార్ వారసులను తప్ప బయటి వారిని కరణ్ ఎదగనివ్వడని ఆరోపించింది. ఇండస్ట్రీకి చెందిన పలువురు వ్యక్తులు కూడా బాలీవుడ్ లో బంధుప్రీతి ఎక్కువ అని వ్యాఖ్యానించారు. నెటిజన్లు కూడా కరణ్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. సుశాంత్ మరణానికి పరోక్షంగా కరణ్ కారణమని వేలెత్తి చూపుతున్నారు. కరణ్ కవల పిల్లలను చంపుతామని బెదిరిస్తున్నారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారానికి కరణ్ తీవ్ర వ్యాకులత చెందుతున్నాడట. వేధించే మాటలతో కరణ్ మనస్థాపానికి గురయ్యాడని, కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని కరణ్ స్నేహితుడు ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కరణ్ మానసిక పరిస్థితి బాగాలేదని, ఎవరినీ కలవడానికి ఇష్టపడడం లేదని ఆయన అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com