ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ఆకస్మిక బదిలీ..

X
By - TV5 Telugu |11 July 2020 10:04 PM IST
ఏపీ ఎస్ఆర్టీసీ ఎండీని ప్రభుత్వం ఆక్ష్మికంగా బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. మాదిరెడ్డి ప్రతాప్ స్థానంలో రవాణాశాఖ కార్యదర్శి కృష్ణబాబుకి ఆర్టీసీ వీసీ అండ్ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు సీఎస్ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఎండీగా ఉన్న మాదిరెడ్డి ప్రతాప్ను ఏపీఎస్పీ బెటాలియన్ల అడిషనల్ డీజీగా ప్రభుత్వం బదిలీ చేసింది. కాగా కృష్ణబాబు గతంలో కూడా ఆర్టిసి ఎమ్.డి.గా పనిచేశారు. మళ్లీ ఆయనకే బాద్యతలు అప్పగించారు. మరోవైపు మాదిరెడ్డి ప్రతాప్ ను ఆకస్మికంగా బదిలీ చేయడం వెనుక కారణాలు మాత్రం తెలియరాలేదు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com