ఆటోను ఢీకొట్టిన లారీ, ముగ్గురి దుర్మరణం

By - TV5 Telugu |12 July 2020 11:31 PM IST
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొట్టడంతో ముగ్గురు మరణించగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బత్తలపల్లి ఇందిరమ్మ కాలనీవద్ద ఆదివారం ఉదయం జరిగింది. ఆదివారం ఉదయాన్నే తాడిమర్రి మండలం పిన్నదరికి చెందిన కొందరు బొప్పాయి పళ్లను బత్తలపల్లి మార్కెట్లో అమ్మేందుకు ఆటోలో వస్తున్నారు.
ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో సూరి, ఆదమ్మ దంపతులు, చెన్నకేశవ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అనంతరం లారీ డ్రైవర్ పరారయ్యాడు. గాయపడ్డవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com