పట్టిసీమ నుంచి భారీగా వరద నీరు

ప్రకాశం బ్యారేజీకి నీరు భారీగా చేరుకుంది. కేసరి, పట్టిసీమ ద్వారా దాదాపు పది వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో ప్రకాశం బ్యారేజి కళకళలాడుతోంది. బ్యారేజీకి ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీలో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరినట్టు తెలుస్తోంది. భారీగా వరదనీరు రావడంతో తూర్పు, పశ్చిమ కాల్వలకు 7,500 క్యూసెక్కులు విడుదల చేశారు,
అలాగే బ్యారేజ్ నుంచి నాలుగు గేట్లు ఎత్తి 2,900 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలారు. మరోవైపు అర్ధరాత్రికి 15వేల క్యూసెక్కుల ఇన్ప్లో వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఈ సందర్బంగా కృష్ణా పరివాహక ప్రాంతాల తహశీల్ధార్లతో కలెక్టర్ ఇంతియాజ్ సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com