పాక్ ఎయిర్లైన్స్పై నిషేధం విధించిన మరోదేశం
By - TV5 Telugu |15 July 2020 3:01 PM GMT
పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ తమ దేశ గగనతలంలోకి తిరగకూడదని ఒమన్ నిషేధం విధించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల అమెరికా, యూరప్ దేశాలు కూడా నిషేధించిన విషయం తెలిసిందే. ఇటీవల పాకిస్తాన్ లో జరిగిన విమాన ప్రమాదం గురించి జరిపిన విచారణలో ఆ విమానం నడిపిన పైలెట్లు నకిలీ పత్రాలతో ఆ ఉద్యోగంలో చేరారని తేల్చారు. అంతేకాదు.. ఈ విచారణంలో పాకిస్తాన్ లో ఉన్న పైలెట్లలో మూడో వంతు మంది నకిలీ పత్రాలతో ఆ ఉద్యోగాల్లో చేరారని తేలింది. దీంతో పలు దేశాలు పాకిస్తాన్ విమానాలు ఆయాదేశాల గగనతలంలో తిరగకుండా నిషేధం విధించాయి. ఇప్పుడు తాజాగా ఒమన్ దేశ పౌరవిమానయాన శాఖ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆ దేశ విమాన సర్వీసుల రాకపోకలపై నిషేధం విధించింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com