టర్కీలో విమాన ప్రమాదం.. ఏడుగురు మృతి

టర్కీలో విమాన ప్రమాదం.. ఏడుగురు మృతి

టర్కీలో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. పర్వత ప్రాంతంలో పరిశీలక విమానం కుప్పకూలడంతో ఏడుగురు భద్రతా అధికారులు మరణించారు. టర్కీలోని పర్వత ప్రాంతంలో 2,200 అడుగులు ఎత్తులో వస్తున్న విమానం ఈ ప్రమాదానికి గురైంది. ఈ విషయాన్ని టర్కీ దేశ మంత్రి సులేమాన్ సోయలు తెలియజేశారు. విమానం బయలుదేరిన కొద్ది సమయంలోనే రాడార్ నుంచి ఆచూకీ లభించలేదని తెలిపారు. టర్కీ భద్రతా బలగాలు కుర్షిదిస్టన్ పార్టీ వర్కర్ మిలిటెంట్లతో పోరాడుతున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంపై దర్యాప్తుకు ఆదేశించామని.. త్వరలేనే అన్ని విషయాలు వెల్లడిస్తామని మంత్రి అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story