పపువా న్యూగినియాలో భారీ భూకంపం
By - TV5 Telugu |17 July 2020 2:15 PM GMT
పసిఫిక్ మహాసముద్రానికి నైరుతి దిశలో ఉన్న పపువా న్యూగినియాలో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం ఉదయం 8.20 గంటలకు భూకంపం సంభవించింది. 7.2 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది. భూకంప కేంద్రం పోర్ట్ మోర్స్బే ఈశాన్యంగా 174 కి.మీ. దూరంలో ఉందని తెలిపింది. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com