తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్సిగ్నల్

X
By - TV5 Telugu |17 July 2020 11:05 PM IST
తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. కూల్చివేతలపై దాఖలైన పిటిషన్లన్నింటిని న్యాయస్థానం కొట్టివేసింది. ఇటీవల సచివాలయం కూల్చివేతను వ్యతిరేకిస్తూ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను కూడా హైకోర్టు ఇవాళ కొట్టివేసింది. దాంతో సచివాలయం కూల్చివేతకు మార్గం సుగమం అయింది. సచివాలయం కూల్చివేతపై దాఖలైన అభ్యంతరాలను కోర్టు తోసిపుచ్చింది. కూల్చివేతకు పర్యావరణ అనుమతులు అవసరంలేదని పేర్కొంది. ఇక ఇప్పటికే 80 శాతం భవనాలను కూల్చివేసినట్టు తెలుస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com