ప్రముఖ గణిత నిపుణులు సీఎస్ శేషాద్రి ఇకలేరు

ప్రముఖ గణిత నిపుణులు సీఎస్ శేషాద్రి కన్నుమూశారు. స్వాతంత్య్రానంతరం భారత గణిత శాస్ర్త నాయకుల్లో ఒకరైన సీఎస్ శేషాద్రి జూలై 17న చెన్నైలో మృతి చెందారు. 88 ఏళ్ల శేషాద్రి క్రమశిక్షణతో అనేక శాఖల్లో పురోగతిని సాధించారు.
టాషా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్లో మొదటి బ్యాచ్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల్లో ఒకరిగా తన కెరీర్ను ప్రారంభించారు. శేషాద్రి 1984లో చెన్నైకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్కు వెళ్లారు.
1989లో చెన్నై ఎస్పీఐసీ సైన్స్ ఫౌండేషన్లో భాగంగా స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ప్రారంభించే అవకాశం అతడికి లభించింది. శేషాద్రి 1988లో రాయల్ సొసైటీ ఫెలోగా, 2010 లో యూఎస్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ విదేశీ అసోసియేట్గా ఎన్నికయ్యాడు. 2009లో అతడికి పద్మ భూషణ్ అవార్డు కూడా లభించింది.
సీఎస్ శేషాద్రి మృతిపట్ల ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మనం ఓ గొప్ప మేధావిని కోల్పోయామని ట్వీట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com