వాయినానికి మా ఇంటికి రావొద్దు..

X
By - TV5 Telugu |21 July 2020 2:35 PM IST
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వాయినానికి మా ఇంటికి రావద్దంటూ ఏర్పాటు చేసిన ప్లెక్సీలు హాట్ టాపిక్ గా మారాయి. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. గనిపూడికి చెందిన యామిజాల శేషు కుటుంబం ఇంటికి ఇలా ప్లెక్సీ పెట్టారు. తాము ఈ సంవత్సరం వ్రతాలు నోములు చేయడం లేదంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీ ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటోంది.
వాయినం కోసం వచ్చే వారిని తిరిగి వెళ్లిపొమ్మని నోటితో చెప్పలేకనే ఇలా ఫ్లెక్సీ ఏర్పాటు చేశామని అన్నారు యామిజాల శేషు. శ్రావణమాసం ప్రారంభం అవుతున్న వేళ శ్రావణ మంగళగౌరి వ్రతాలు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ జనం గుమిగూడి ఈ వ్రతాలకు దూరంగా ఉండాలన్న ఉద్దేశ్యంతోనే ఇలా చేశామన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

