గవర్నర్ తమిళిసైతో సీఎం కేసీఆర్ భేటీ

X
By - TV5 Telugu |21 July 2020 12:20 AM IST
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సోమవారం సాయంత్రం భేటీ అయ్యారు. హైదరాబాద్ రాజ్భవన్లో భేటీ అయిన కేసీఆర్.. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కరోనా నివారణ చర్యలు, రోగులకు అందుతున్న చికిత్స సచివాలయం కూల్చివేత, నూతన సచివాలయ నిర్మాణం, పై గవర్నర్కు సీఎం వివరించినట్టు తెలుస్తోంది. అలాగే గవర్నర్ కోటాలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీ చేసే విషయంపై కూడా ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com