కరోనా సోకిందని ఇంటినుంచి మహిళ గెంటివేత

X
By - TV5 Telugu |21 July 2020 12:30 AM IST
కరోనా వైరస్ సమాజంలో విలువలు కూడా లేకుండా చేస్తోంది. నెల్లూరు జిల్లాలో మానవత్వం మంటగలిసె దారుణ ఘటన చోటుచేసుకుంది. కలువాయిలో క్యాన్సర్ చికిత్స పొందుతున్న ఓ మహిళకు కరోనా పాజిటివ్ అని తేలింది. దేంతో కుటుంబసభ్యులు ఆ మహిళను ఇంటినుంచి బయటకు గెంటి వేశారు. స్థానిక వాలంటీర్ కు సమాచారం ఇస్తే ఇది తమ పరిధిలోకి రాదంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. దేంతో గత్యంతరం లేక రెండు రోజులుగా ఊరి చివరనే ఉంటుంది ఆ మహిళ. తనపై దయతలచి కరోనా చికిత్స అందించాలని ఆ మహిళ వేడుకుంటోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

