కాంగ్రెస్ ఎమ్మెల్యేకు సచిన్ పైలట్ నోటిసులు

X
By - TV5 Telugu |22 July 2020 3:20 PM IST
రాజస్థాన్ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది. కాంగ్రెస్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే గిరిరాజ్ సింగ్ మలింగకు లీగల్ నోటీసులు పంపించారు. ఈ విషయాన్ని సచిన్ పైలట్ వాట్సప్ ద్వారా విలేకరలకు తెలియజేశారు. రాజ్యసభ ఎన్నికల సందర్భంగా బీజేపీలో చేరితే 35 కోట్లు ఇస్తామని సచిన్ పైలట్ తనకు ఆశచూపారని.. కానీ, తాను ఆ ఆఫర్ తిరస్కరించానని ఎమ్మెల్యే మలింగ ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో సచిన్ పైలట్ ఆయన ఆరోపనలు ఖండిస్తూ.. ఆయనకు నోటీసులు పంపించారు. తన పరువుకు భంగం కలిగించేలా ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఉన్నాయని సచిన్ తన నోటీసుల్లో పేర్కోన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com