ఏపీలో కొత్తగా 6 వేలకు పైగా కేసులు.. 6,494 మంది డిశ్చార్జ్..

ఏపీలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో మొత్తం 49,553 శాంపిల్స్ ని పరీక్షించగా 6,045 మంది కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. 6494 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్ అయ్యారు.
కోవిడ్ వల్ల గుంటూరు లో పదిహేను మంది, కృష్ణ లో పది మంది, పశ్చిమ గోదావరి లో ఎనిమిది మంది, తూర్పు గోదావరి లో ఏడుగురు, చిత్తూర్ లో ఐదుగురు, కర్నూల్ లో ఐదుగురు, విజయనగరం లో నలుగురు, ప్రకాశం లో ముగ్గురు, శ్రీకాకుళం లో ముగ్గురు, విశాఖపట్నం లో ముగ్గురు, కడప లో ఒకరు, నెల్లూరు లో ఒకరు మరణించారు ఇప్పటి వరకూ రాష్ట్రంలో 14,35,827 శాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది. రాష్ట్రం లో నమోదైన మొత్తం 61,818 పాజిటివ్ కేసు లకు గాను 29,390 మంది డిశ్చార్జ్ కాగా.. 823 మంది మరణించారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 31,605 గా ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com