హైదరాబాద్లో కరోనా కలకలం.. ఇద్దరు ఎస్ఐలకు పాజిటివ్

తెలంగాణలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. నిత్యం పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కరోనా వైరస్ స్వైర విహారం చేస్తోంది. ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా ఇద్దరు ఎస్ఐలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు శుక్రవారం ఉదయం వైద్యాధికారులు వెల్లడించారు. వీరిద్దరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇదే పోలీసు స్టేషన్లో ఇప్పటికే 31 మంది పోలీసులకు కరోనా సోకింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 33కు చేరింది. పీఎస్ సిబ్బంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, హైదరాబాద్లో గురువారం ఒక్కరోజే 662 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 50,826కు చేరింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com