ఏపీలో కొత్తగా 8,147 మందికి కరోనా పాజిటివ్

ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ విజృంభిస్తూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 48,114
శాంపిల్స్ ని పరీక్షించగా 8,147 మంది కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
అలాగే కొత్తగా 2,380 మంది కోవిద్ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ వల్ల తూర్పు గోదావరి లో పదకొండు మంది, కృష్ణ లో తొమ్మిది మంది, కర్నూల్ లో ఎనిమిది మంది, శ్రీకాకుళం లో ఏడుగురు, పశ్చిమ గోదావరి ఐదుగురు, గుంటూరు లో ముగ్గురు,
విశాఖపట్టం లో ముగ్గురు, చిత్తూరు లో ఒక్కరు, ప్రకాశం లో ఒక్కరు, విజయనగరం లొ ఒక్కరు మరణించారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 15,41,993 శాంపిల్స్ ని పరీక్షించారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం 77,963 పాజిటివ్ కేసులకు గాను 37,198 మంది డిశ్చార్జ్ కాగా.. 993 మంది మరణించారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 39,832 గా ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com