నేపాల్ లో నిలకడగా కొనసాగుతున్న కరోనా కేసులు

X
By - TV5 Telugu |27 July 2020 12:08 AM IST
నేపాల్లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో కేవలం 109 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా భారిన పడిన వారి సంఖ్య 18 వేల 483 కు చేరుకుంది. అయితే నమోదైన మొత్తం కేసుల్లో 13 వేల 53 మంది కోలుకున్న తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది.
భోజ్పూర్, పంచచార్, సంకువాసభ, రసూవా, మనంగ్, ముస్తాంగ్ జిల్లాల్లోని ఆరు జిల్లాల్లో కొత్త కేసులు లేవని తెలిపింది. రౌతత్, కైలాయ్ మరియు బాజురా జిల్లాల్లో మాత్రం 500 కి పైగా కేసులు ఉన్నాయని అన్నారు. ఇప్పటివరకు 45 మంది మరణించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com