పిడుగుపడి 11మంది మృతి

X
By - TV5 Telugu |28 July 2020 7:57 PM IST
పశ్చిమబెంగాల్లో పిడుగుపాటుకి గురై 11 మంది మృతిచెందారు. మొత్తం మూడు జిల్లాలో 11మంది మరణించడంతో.. ఈ ఘటణలు చోటుచేసుకున్న గ్రామాల్లో విషాద చాయలు అలుముకున్నాయి. బంకురా జిల్లాలో ఐదుగురు, పూర్బ బర్ధమాన్ జిల్లాలో మరో ఐదుగురు, హౌరాలో ఒకరు.. మొత్తం 11మంది మరణించారు. పొలంలో పనిచేస్తుండగా పిడుగులు పడి మరణించారని అన్నారు. వర్షం పడుతుందని ఓ రైతు చెట్టు కిందకు తల దాచుకునేందుకు రాగా పిడుగుపడి మరణించారు. దక్షిణ పశ్చిమబెంగాల్ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో పాటు భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ కేంద్రం అధికారులు చెప్పారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com