పాకిస్థాన్లో కాల్పులు.. ఐదుగురు కమాండోలు మృతి

X
By - TV5 Telugu |29 July 2020 4:06 AM IST
పాకిస్థాన్లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో ఐదుగురు పోలీస్ కమాండోలు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం తెల్లవారుజామున దుండగులు ఒక్కసారిగా పోలీసులపై కాల్పులకు పాల్పడ్డారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లోని గిల్గిత్ బాల్టిస్థాన్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. దుండగుల కాల్పుల్లో ఐదుగురు పోలీస్ కమాండోలు మృతిచెందగా మరో పోలీస్ గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పారిపోయిన దుండగుల కోసం గాలింపు చేపట్టారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com