ఇండియాలో ఒక్కరోజే 52,123 కరోనా పాజిటివ్ కేసులు

X
By - TV5 Telugu |30 July 2020 5:26 PM IST
ఇండియాలో కరోనా విలయతాండవం చేస్తోంది. నిత్యం పాజిటివ్ కేసులు బారీగా పెరుగుతున్నాయి. గత కొద్దిరోజుల నుంచి ప్రతిరోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 52,123 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
కరోనా బారిన పడి ఒక్కరోజే 775 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15,83,792కు చేరింది. ప్రస్తుతం 5,28,242 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 10,20,582 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 34,968కు చేరింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

