ఎమ్మెల్యేల రేట్లు పెరిగాయి : సీఎం సంచలన వ్యాఖ్యలు

రాజస్థాన్ ముఖ్యమంత్రి, మాజీ డిప్యూటీ సిఎం, గవర్నర్, స్పీకర్ మరియు పలువురు ఎమ్మెల్యేల మధ్య కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం మధ్య, అసెంబ్లీ సమావేశ తేదీ ప్రకటించిన తరువాత రాష్ట్రంలో హార్స్ట్రేడింగ్ రేట్లు పెరిగాయని అశోక్ గెహ్లాట్ పేర్కొన్నారు. ఇప్పటివరకు ఒక్కో ఎమ్మెల్యేకు అడ్వాన్స్గా రూ. 10 కోట్లు, రెండో విడతగా రూ. 15 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారు. ఇప్పుడు.. అసెంబ్లీ సమావేశాల తేదీ ప్రకటించిన తరువాత.. ఎంత కావాలో చెప్పండి అంటూ ముందుకు వచ్చారని ముఖ్యమంత్రి గెహ్లాట్ ఆరోపించారు.
అసెంబ్లీ సమావేశాన్ని ఆలస్యం చేసే మొత్తం నాటకం బిజెపికి మరికొంతమందిని చేర్చడానికి మాత్రమే తయారుచేసినట్లు పేర్కొన్నారు. ఆగస్టు 14 న రాష్ట్ర అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించడానికి గవర్నర్ కలరాజ్ మిశ్రా బుధవారం అంగీకరించిన నేపథ్యంలో.. సీఎం వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అసెంబ్లీ సమావేశపరచాల్సిందిగా గవర్నర్ను ఒప్పించడానికి సిఎం అనేక ప్రయత్నాలు చేశారు, ప్రతిసారీ గవర్నర్ కలరాజ్ మిశ్రా ను కలిసి ప్రతిపాదన చేయడం.. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని గవర్నర్ సీఎం ప్రతిపాదనను తిరస్కరించడం జరుగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com