ఆఫ్ఘనిస్తాన్పై రాకెట్ దాడి.. 9 మంది మృతి
ఆఫ్ఘనిస్తాన్లో రాకెట్ దాడి జరిగింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. మరో 50 మందికి పైగా గాయలైనట్లు ఆఫ్ఘనిస్తాన్ తెలిపింది. ఈ రాకెట్ దాడులు పాకిస్తాన్ చేసిందని ఆఫ్ఘాన్ ఆరోపించింది. కందహార్ స్పిన్ బోల్డాక్ జిల్లాలోని జనాభా ప్రాంతంలో పాకిస్తాన్ సైన్యం రాకెట్లను పేల్చిందని ఆఫ్ఘనిస్తాన్ వార్త సంస్థ తెలిపింది.
పాకిస్తాన్ సైన్యంపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఆఫ్ఘన్ దళాలు సిద్ధంగా ఉండాలని ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. మొహమ్మద్ యాసిన్ జియా నేతృత్వంలోని వైమానిక దళం, ప్రత్యేక దళాలను తీవ్ర హెచ్చరికలో ఉంచారని, పాకిస్తాన్ సైన్యం ఆఫ్ఘన్ భూభాగంలో తన రాకెట్ లాంచర్లను కొనసాగిస్తే ఆఫ్ఘన్ మిలిటరీ ప్రతీకారం తీర్చుకుంటుందని ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
Tags
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com