సరిహద్దుల్లో కాల్పుల కలకలం.. జవాన్ మృతి

X
By - TV5 Telugu |1 Aug 2020 7:23 PM IST
సరిహద్దుల్లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. పాకిస్థాన్ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తుంది. శనివారం పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో ఓ భారత జవాన్ అమరుడయ్యాడు. ఈ ఘటన జమ్ముకశ్మీర్లోని పూంచ్ జిల్లా బాలాకోట్ సెక్టార్లో చోటు చేసుకుంది.
జూలై 29న పాకిస్థాన్ మూకలు విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి. బారాముల్లా సరిహద్దుల్లో నియంత్రణా రేఖ వద్ద మోర్టార్లు, ఇతర ఆయుధాలతో కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఇండియన్ ఆర్మీ పోర్టర్ మరణించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

